15, ఏప్రిల్ 2018, ఆదివారం

నా కవిత పేరు మాతృ భూమి.

పసిపాపల కేరింతల సవ్వడి
శుకపికరావముల కూతల సవ్వడి
కన్నె పిల్లల అందెల సవ్వడి
నా మాతృభూమికి సుప్రభాతం.

పసిడి పంటల పచ్చ దనం
పరిమళాల పూవుల సుగంధం
నీరెండ కాంతుల పచ్చదనం
నా మాతృభూమి కనుల సొగసుదనం.

కవిరాజుల కవితాహారం
మహారాజుల విజయ విహారం
వేదవిదుల విజ్ఞాన భాండారం
నా మాతృభూమికి సుమహారం .

స్వార్థ ప్రజల కుటిల నీతి
అసమర్థ నేతలు అవినీతి
నిస్వార్థ  వృత్తుల  భయభీతి
నా మాతృభూమి హృదయ వేదనాగీతి.

మాతృమూర్తి  మనసు మధురం
మాతృభూమి పలుకు మధురం
మాతృభూమి సేవ మధురం
మరచిన బ్రతుకు వ్యర్థం వ్యర్థం.

అరుదైన వేదాల అలరారు భూమి
అమృతమూర్తుల అపురూపమైన భూమి
అమృత జలాల పావన భూమి
నా మాతృభూమికి అరుదైన అలంకారం.

అన్ని లోకాల మరపించు పుణ్యక్షేత్రాలు
అన్ని మతాల మరపించు తీర్థ క్షేత్రాలు
అన్ని భాషల పలికించే ఏకైక దేశం
అన్ని దేశాలకు ఆదర్శం నా మాతృభూమి

ఇటువంటి నా మాతృభూమికి వందనం అభివందనం.

ఈ కవిత నేను రచించినది. దేనికి అనుకరణ కాదు.
నా ఎస్. కె. నంబరు 2359

నా పేరు డా. దేవులపల్లి పద్మజ
ఊరు విశాఖ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి